బిగ్ బ్రేకింగ్: ఇంటర్ ఫలితాలు విడుదల

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు.

Update: 2023-04-26 13:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. కాగా, కేవలం పరీక్షలు ముగిసిన 22 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసినట్లు ఏపీ ఇంటర్మిడియట్ అధికారులు తెలిపారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్ సైట్ ద్వారా చూసుకోవచ్చని తెలిపారు. ఇక, 4,33, 275 మంది ఫస్టియర్ విద్యార్థులు పరీక్ష రాయగా.. 61 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 3, 79, 750 మంది సెకండియర్ విద్యార్థులు పరీక్ష రాయగా.. 72 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. ఫస్టియర్‌లో 2,66,326 మంది విద్యార్థులు పాస్ అవ్వగా.. సెకండియర్‌లో 2,72,001 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. పరీక్ష ఫలితాల విడుదల అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. రెండు సంత్సరాల్లో రిజల్ట్స్‌లో బాలికలే టాప్‌లో నిలిచారని తెలిపారు. అత్యధిక ఉత్తీర్ణత శాతం (83 శాతం) సాధించిన జిల్లాగా కృష్ణా జిల్లా నిలిచినట్లు ఆయన వెల్లడించారు.

ఇవి కూడా చదవండి :

Breaking: ఏపీ ఇంటర్ ఫలితాల్లో బాలికలే టాప్


Similar News