AP : కాసేపట్లో కూటమి శాసనసభాపక్ష సమావేశం

ఏపీలో నేడు ఉదయం 9.30 గంటలకు కూటమి శాసనసభాపక్ష సమావేశం జరగనుంది.

Update: 2024-06-11 03:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో నేడు ఉదయం 9.30 గంటలకు కూటమి శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. నేడు చంద్రబాబును సీఎం అభ్యర్థిగా కూటమి ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ప్రతిపాదించే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ ప్రతిపాదనను బీజేపీ ఎమ్మెల్యేలు బలపరిచే అవకాశం ఉంది. అనంతరం ఏకగ్రీవ తీర్మానాన్ని గవర్నర్‌కు కూటమి నేతలు పంపనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు కూటమికి గవర్నర్ ఆహ్వానం పంపనున్నారు. రేపు ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ రానున్నారు. రేపు ఉదయం 10.40 గంటలకు మోడీ గన్నవరం చేరుకోనున్నారు. రేపు ఉదయం 10.55 గంటలకు ప్రమాణ స్వీకార వేదిక వద్దకు మోడీ చేరుకోనున్నారు. రేపు ఉదయం 11 నుంచి 12.30 వరకు వేదికపై మోడీ ఉండనున్నారు. మధ్యాహ్నం 12.40 గంటలకు గన్నవరంకు మోడీ చేరుకోనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి మోడీ భువనేశ్వర్ వెళ్లనున్నారు. అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రామ్ చరణ్ హాజరుకానున్నారు. రేపు ఉదయం 11.27 గంటలకు కేసరిపల్లి వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  


Similar News