AP : మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద భారీ భద్రత..
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండో రోజు పులివెందులలో పర్యటిస్తున్నారు.
దిశ, వెబ్డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండో రోజు పులివెందులలో పర్యటిస్తున్నారు. కాగా, జగన్ ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పులివెందుల పర్యటనలో ఉన్న జగన్ను కలిసేందుకు శనివారం భారీగా అభిమానులు రాగా పరిస్థితి కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. దీంతో జగన్ క్యాంపు కార్యాలయం దగ్గర సైతం భద్రత పెంచారు. జగన్ను కలిసేందుకు ముఖ్య నాయకులకు మాత్రమే అనుమతి ఇస్తు్న్నారు.