ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక అర్చకులకే సర్వాధికారాలు!

Update: 2024-10-10 03:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం నాడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆలయాల్లో అర్చకులకు విస్తృతాధికారులు కట్టబెట్టినట్లైంది. ఇక ఈ జీవో ప్రకారం.. దేవదాయ కమిషనర్ సహా ఏ స్ఖాయి అధికారి అయినా వైదిక విధుల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. పూజలు, సేవలు, యాగాలు, కుంభాభిషేకాల వంటి వాటిల్లో అధికారుల పాత్రని పరిమితంగానే ఉంటుంది. ఆలయాల ఆగమ శాస్త్రాల ప్రకారం వైదిక విధులు నిర్వహించుకునేందుకు అర్చకులకు వెసులుబాటు లభిస్తుంది. ఆధ్యాత్మిక విధుల విషయంలో ఏ విషయంలో అయినా సరే ఫైనల్ డెసిషన్ తీసుకునే పవర్ అర్చకులకే ఉంటుంది. అవసరమైతే ఈవోలు వైదిక కమిటీలు వేసుకోవచ్చు. ఏదైనా ఆధ్యాత్మిక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరకుంటే పీఠాధిపతుల సలహాలు తీసుకోవచ్చు.


Similar News