AP Government:రేషన్ కార్డుదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!

రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-08-31 13:03 GMT

దిశ,వెబ్‌డెస్క్:రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీయే కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పలు శాఖల పై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. తాజాగా పౌరసరఫరాల శాఖను ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలకు సెప్టెంబర్ నుంచి బియ్యంతో పాటు పంచదార కూడా ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన పంచదార ప్యాకెట్ల కొలతల్లో తేడాలు ఉన్నట్లు తేలడంతో జులై, ఆగస్టు నెలల్లో కార్డుదారులకు పంచదార సరఫరాను నిలిపివేశారు. ఇప్పుడు ఆ లోపాలను సరిచేసి రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు పంచదారని కూడా సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక అక్టోబర్ నెల నుంచి కందిపప్పు, గోధుమపిండి కూడా పంపిణీ చేయనున్నారు. అలాగే అంత్యోదయ అన్న యోజన కార్డు ఉన్నవారికి అరకేజీ పంచదార రూ. 13కు పంపిణీ చేయనున్నట్లు సమాచారం.


Similar News