కర్ణాటక సీఎంతో భేటీ అయిన పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక సీఎం సిద్దరామయ్యను కలిశారు.

Update: 2024-08-08 10:58 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక సీఎం సిద్దరామయ్యను కలిశారు. గురువారం కర్ణాటక పర్యటనకు వెళ్ళిన పవన్ కళ్యాణ్, ఆ రాష్ట్ర సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి, ఇరు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని కోరినట్టు తెలుస్తోంది. ఎర్రచందనం అక్రమ రవాణను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేయాలని సిద్ధరామయ్యను ప్రత్యేకంగా కోరారు. అలాగే కర్ణాటక నుండి 6 కుంకీ ఏనుగులను ఏపీకి ఇవ్వాలని ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రిని కోరారు. పొలాల మీద, ఊళ్ళ మీద పడే ఏనుగులను తరిమేందుకు కుంకీ ఏనుగులు ఉపయోగపడతాయని, ప్రస్తుతానికి ఏపీలో రెండు మాత్రమే ఉన్నాయని, పొరుగు రాష్ట్రం కర్ణాటకలో వీటి సంఖ్య ఎక్కువని అటవీశాఖ అధికారులు గతంలో పవన్ కి వివరించగా.. ఇపుడు కర్ణాటక పర్యటనకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ తానే స్వయంగా అక్కడి ప్రభుత్వాన్ని కుంకీ ఏనుగులు కావాలని కోరారు. 


Similar News