ఓటమి బాధలో ఉన్న వైసీపీకి మరో బిగ్ షాక్.. సంచలన ఆరోపణలు

ఏపీ అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న వైసీపీపై టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు.

Update: 2024-06-05 06:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న వైసీపీపై టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న సజ్జల ఆధ్వర్యంలో ప్రముఖ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని డొక్కా బాంబు పేల్చారు. ప్రజాప్రతినిధుల ఫోన్లు, వారి వ్యక్తిగత సంభాషణలను వైసీపీ నేతలు రికార్డు చేయించారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే జగన్ ప్రభుత్వంపై పలువురిని బెదిరించిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పై వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాగా, తెలంగాణలో ఇటీవల అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎంక్వైరీ వేసిన విషయం తెలిసింది. ఈ కేసులో పలువురు ఇంటెలిజెన్స్ అధికారులను అరెస్ట్ చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే.


Similar News