AP:మహిళ హత్య కేసును 48 గంటల్లో ఛేదించిన పోలీసులు

మేకల కాపరి అయిన ఓ మహిళ హత్య కేసును హిందూపురం సబ్ డివిజన్ పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేశారు.

Update: 2024-08-22 15:24 GMT

దిశ ప్రతినిధి, అనంతపురం:మేకల కాపరి అయిన ఓ మహిళ హత్య కేసును హిందూపురం సబ్ డివిజన్ పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేశారు. అతని నుంచి 13 మేకలు, ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్, బొలెరో వాహనం స్వాధీనం చేసుకున్నారు. మేకలు కాసేందుకు వెళ్లిన మహిళను చంపి ఆమెకు సంబంధించిన 13 మేకలు బొలెరో ద్వారా ఎత్తుకెళ్లినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. జిల్లా ఎస్సీ రత్న ఆదేశాల మేరకు పెనుగొండ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, హిందూపురం డిఎస్సీ కేవీ మహేష్ మీడియాకు వివరాలు వెల్లడించారు. సోమందేపల్లి మండలం ఈదులబళాపురం గ్రామానికి చెందిన నిందితుడు కంబాలప్పగారి హరి అలియాస్ కథల హరి (25)ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.


Similar News