breaking: పార్టీ మారడంపై స్పష్టత ఇచ్చిన ఆదాల ప్రభాకర్ రెడ్డి

రానున్న ఎన్నికల నేపధ్యంలో అంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో రకంగా మారుతున్నాయి.

Update: 2024-02-14 06:00 GMT

దిశ డైనమిక్ బ్యూరో:  రానున్న ఎన్నికల నేపధ్యంలో అంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ఓ వైపు అధినేతల ప్రచారాలు మరో వైపు నేతల మార్పలు చేర్పులతో అంధ్రప్రదేశ్ లో ఎన్నకల వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నేపధ్యంలో గత కొంత కాలంగా నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీ మారుతున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది.

అయితే తాజాగా పార్టీ మారనున్నారు అంటూ తనపై వస్తున్న వార్తలపై ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తన పై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు. తాను తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇక ఏడాది నుంచి ఇదే మాట చెబుతున్నా తనపై తప్పుడు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మోదని ప్రజలకు సూచించ్చారు.

అలానే సీఎం జగన్ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే పోటీ చేస్తానని.. ఇక ఎక్కడి నుండి పోటీ చేసే అంశం పై అధినేతను కలిసిన తర్వాత క్లారిటీ ఇస్తానని ఆయన వివరించారు.

Tags:    

Similar News