AP Minister:ఏపీ మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

Update: 2024-08-30 13:19 GMT

దిశ,ఏలూరు:రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఏలూరులో శుక్రవారం జరిగిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు. తొలుత ఎమ్మెల్యేలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో విగ్రహం వద్ద తాత్కాలిక మెట్ల కోసం ఏర్పాటుచేసిన పరంజా పైకి మంత్రితో పాటు ఇతర ఎమ్మెల్యేలు, నాయకులు ఎక్కారు. వీరందరి బరువుకు పరంజా కుంగింది. దీంతో నిమ్మల తూలి కింద పడబోయారు. పక్కన ఉన్న టీడీపీ నాయకులు మంత్రి కింద పడిపోకుండా పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


Similar News