Breaking News: వైసీపీ గూటికి టీడీపీ కీలకనేత.. కారణం ఇదే..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. రానున్న ఎన్నికల నేపథ్యంలో టికెట్ దక్కని నేతలు పార్టీలు మారుతున్నారు.

Update: 2024-03-15 06:56 GMT

దిశ, రాయచోటి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. రానున్న ఎన్నికల నేపథ్యంలో టికెట్ దక్కని నేతలు పార్టీలు మారుతున్నారు. తాజాగా రాయచోటి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డి ఫ్యాన్ గాలిని కోరుకుంటున్నారని దీనితో సైకిల్ దిగిపోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీకి బైబై చెప్పి ఈ నెల 16వ తేదీ వైసీపీ గూటికి చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా గత 20 సంవత్సరాలుగా టిడిపిలో కొనసాగిన రమేష్ కుమార్ రెడ్డి మూడుసార్లు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ లో ఓటమి పాలైయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం ఆయనకు టికెట్ నిరాకరించింది. దీనితో మనస్థాపానికి గురైన రమేష్ టీడీపీకి టాటా చెప్పి వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారని రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా నియోజకవర్గంలో మంచిపట్టున్న వ్యక్తిగా రమేష్ కుమార్ పేరు తెచ్చుకున్నారు. తెలుగుదేశం తరుపున పార్టీ టికెట్ రాకపోవడంతో.. రమేష్ కుమార్ రెడ్డి ఆయన వర్గంతో మండలాలు వారిగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

Read More..

వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం.. ఆహ్వానించిన CM జగన్  

Tags:    

Similar News