Breaking: శ్రీకాకుళం జిల్లాలో భారీ పేలుడు..ఎగిసిపడ్డ మంటలు

శ్రీకాకుళం జిల్లాలో భారీ పేలుడు జరిగింది..

Update: 2024-06-29 12:46 GMT

దిశ, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్లాలో ఓ కంపెనీలో బాయిలర్ పేలి ఆరుగురు మృతి చెందిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగి 24 గంటలు గడవకముందే మరొక ఇన్సిడెంట్ తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో సరాకకెమికల్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే పొగ దట్టంగా పరిసరాలకు కమ్ముకుంది.  అయితే భారీ శబ్ధంతో ఒక్కసారిగా పేలుడు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఉపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Similar News