AP News:వరద సహాయక పనులకు 20 మంది పారిశుద్ధ్య కార్మికులు

వరదలలో సహాయక పనుల నిమిత్తం పిఠాపురం పురపాలక సంఘం నుంచి 20 మంది పారిశుద్ధ్య కార్మికులు విజయవాడ వెళ్ళారు.

Update: 2024-09-03 12:19 GMT

దిశ,పిఠాపురం:వరదలలో సహాయక పనుల నిమిత్తం పిఠాపురం పురపాలక సంఘం నుంచి 20 మంది పారిశుద్ధ్య కార్మికులు విజయవాడ వెళ్ళారు. వరద బాధితులకు అహార సామాగ్రి అందించేందుకు దాతలు, స్వచ్చంద సంస్థలు ముందుకు వస్తున్న నేపథ్యంలో ఆహార కొరత పెద్దగా లేదని, కానీ పారిశుద్ధ్య పనులు చేసేందుకు సిబ్బంది కరువును పిఠాపురం మున్సిపాలిటీ గుర్తించింది. ఈ మేరకు పిఠాపురం పురపాలక సంఘం నుంచి 20 మంది పారిశుద్ధ్య కార్మికులను పంపించినట్లు కమిషనర్ కనకారావు తెలిపారు. మంగళవారం వారిని ప్రత్యేక వాహనాల్లో అక్కడికి పంపించారు. వరదల నేపథ్యంలో విజయవాడలో పారిశుద్ధ్య సమస్య నెలకొంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో అక్కడ పారిశుధ్య పనులు నిర్వహించేందుకు వీరిని పంపించినట్లు చెప్పారు.


Similar News