విజయవాడకు అక్కినేని నాగార్జున.. సీఎం జగన్‌తో భేటీ?

దిశ, ఏపీ బ్యూరో: విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున సందడి చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గురువారం ఆయన గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. నాగార్జున వెంట నిర్మాతలు ప్రీతం రెడ్డి, నిరంజన్ రెడ్డిలు ఉన్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన విజయవాడ బయల్దేరి వెళ్లారు. అయితే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయ్యేందుకే నాగార్జున విజయవాడ వచ్చారని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Update: 2021-10-28 02:39 GMT

దిశ, ఏపీ బ్యూరో: విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున సందడి చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గురువారం ఆయన గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. నాగార్జున వెంట నిర్మాతలు ప్రీతం రెడ్డి, నిరంజన్ రెడ్డిలు ఉన్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన విజయవాడ బయల్దేరి వెళ్లారు. అయితే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయ్యేందుకే నాగార్జున విజయవాడ వచ్చారని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Tags:    

Similar News