భారత్ వర్సెస్ పాకిస్తాన్ : ఆ జట్టే ఫేవరెట్.. విన్నర్ను తేల్చేసిన క్రిస్ గేల్
టీ20 వరల్డ్ కప్లో ఆదివారం భారత్, పాకిస్తాన్ జట్లు తలపడబోతున్నాయి.
దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్లో ఆదివారం భారత్, పాకిస్తాన్ జట్లు తలపడబోతున్నాయి. ఆ మ్యాచ్లో టీమ్ ఇండియానే ఫేవరెట్ అని వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ అభిప్రాయపడ్డాడు. ఐసీసీతో గేల్ మాట్లాడుతూ..‘భారత్ డ్రైవర్ సీట్లో ఉంది. పాక్తో పోలిస్తే ఆ జట్టుకే విజయావకాశాలు ఎక్కువ. కానీ, వరల్డ్ కప్లో భారత్, పాక్ ఆడటం వేరు. భారత్తో పాక్కు సవాల్ తప్పదు.’ అని వ్యాఖ్యానించాడు. అలాగే, పాక్పై విజయం సాధించిన అమెరికా జట్టుపై గేల్ ప్రశంసలు కురిపించాడు. ‘పాక్ను ఓడించిన అమెరికా క్రికెట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అందులో నేను కూడా ఉన్నా. ఈ ఫలితం అమెరికా జట్టుకే కాదు.. క్రికెట్కే చాలా పెద్దది.’అని చెప్పుకొచ్చాడు. కాగా, ప్రస్తుత టీ20 వరల్డ్ కప్కు యువరాజ్ సింగ్తోపాటు క్రిస్ గేల్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.