భారత్ చేతిలో ఓటమి.. ఆస్ట్రేలియా సెమీస్కు చేరుకోవాలంటే అదొక్కటే దారి
టీ20 వరల్డ్ కప్లో సూపర్-8లో భాగంగా జరిగిన మ్యాచ్లో ఆసిస్ను రోహిత్ సేన 24 పరుగుల తేడాతో ఓడించింది.
దిశ, స్పోర్ట్స్ : గతేడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. సెమీస్కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆసిస్ను చావు దెబ్బకొట్టింది. టీ20 వరల్డ్ కప్లో సూపర్-8లో భాగంగా జరిగిన మ్యాచ్లో ఆసిస్ను రోహిత్ సేన 24 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో భారత్ సెమీస్కు చేరుకోగా.. ఆస్ట్రేలియా ఆశలు సంక్లిష్టమయ్యాయి. అయితే, ఆ జట్టు సెమీస్కు చేరుకోవడానికి ఇంకా చాన్స్ ఉంది. కానీ, అది ఆసిస్ చేతిలో లేదు.
సూపర్-8లో ఆస్ట్రేలియా చివరి మ్యాచ్ ఆడేయడంతో ఆ జట్టు భవిష్యత్తు బంగ్లా, అఫ్గాన్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంది. బంగ్లా గెలిస్తే ఆసిస్ సెమీస్కు చేరుకోవచ్చు. ప్రస్తుతం ఆస్ట్రేలియా(2 పాయింట్స్, -0.331), అఫ్గాన్(2 పాయింట్స్ -0.650) జట్లు రెండేసి పాయింట్లతో సమంగా ఉన్నాయి. అయితే, నెట్రన్రేట్ విషయంలో ఆసిస్ మెరుగ్గా ఉంది. ఇదే ఆ జట్టుకు కలిసిరానుంది. బంగ్లా చేతిలో అఫ్గాన్ ఓడితో మెరుగైన నెట్రన్రేట్తో ఆసిస్ ముందడుగు వేయనుంది. ఒకవేళ అఫ్గాన్ గెలిస్తే కంగారులు ఇంటిదారిపట్టాల్సిందే. అఫ్గాన్ జట్టు 4 పాయింట్లతో సెమీస్కు చేరుకుంది.