T20 World Cup : నేపాల్ కెప్టెన్తో గొడవ.. బంగ్లా బౌలర్కు షాక్ ఇచ్చిన ఐసీసీ
బంగ్లాదేశ్ పేసర్ తాంజిమ్ హసన్కు ఐసీసీ జరిమానా విధించింది.
దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్ పేసర్ తాంజిమ్ హసన్కు ఐసీసీ జరిమానా విధించింది. టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఈ నెల 16న నేపాల్తో జరిగిన మ్యాచ్లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పెట్టింది.
ఆ మ్యాచ్లో తాంజిమ్ నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్తో వాగ్వాదానికి దిగాడు. ఆ ఘటన నేపాల్ ఇన్నింగ్స్లో మూడో ఓవర్లో చోటు చేసుకుంది. బంతి వేసిన తర్వాత తాంజిమ్, రోహిత్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో తాంజిమ్ చేతితో రోహిత్ను నెట్టినట్టు వీడియోలో కనిపించింది.
ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.12 ప్రకారం.. ఇది ఉల్లంఘన కిందికి వస్తుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ తాంజిమ్ మ్యాచ్ ఫీజులో కోత పెట్టింది. ఆ మ్యాచ్లో సంచలన ప్రదర్శన చేసిన తాంజిమ్ 4 వికెట్లతో నేపాల్ పతనాన్ని శాసించాడు. నేపాల్పై విజయంతో బంగ్లా ఏ అడ్డంకి లేకుండా సూపర్-8 రౌండ్కు చేరుకున్న విషయం తెలిసిందే.