ఫైనల్‌లో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ.. టీమిండియా స్కోర్ ఎంతంటే..?

సౌతాఫ్రికాతో జరుగుతోన్న టీ-20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు.

Update: 2024-06-29 16:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: సౌతాఫ్రికాతో జరుగుతోన్న టీ-20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. 48 బంతుల్లో కోహ్లీ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మ్యాచ్ ప్రారంభంలోనే వరుసగా మూడు వికెట్ల కోల్పోయి టీమిండియా తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లగా.. అక్షర్ పటేల్‌తో కలిసి కోహ్లీ వికెట్ల ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు. మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్న కొంచెం కూడా ఒత్తిడికి గురి కాకుండా బ్యాటింగ్ చేసి టీమిండియాను టైటిల్ రేసులో నిలిపాడు. సౌతాఫ్రికా బౌలర్లు రెచ్చిపోవడంతో మ్యాచ్ ప్రారంభంలోనే భారత్  వెంట వెంటనే వికెట్లు కోల్పోగా.. కోహ్లీ తనదైన ఆట తీరుతో టీమిండియాను ఆదుకున్నాడు. భారత్‌ను కష్టాల నుండి గట్టేక్కించి తన వ్యాల్యూ ఏంటో విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఇండియా 18.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. క్రీజ్‌లో కోహ్లీ 68, శివమ్ దూబే 22 ఉన్నారు. 

Similar News