పరారీలో ఉన్న రిజ్వాన్‌ను పట్టుకున్న పోలీసులు.. కేసు ఇదే..!

నిజామాబాద్ నగరంలో ఆరో టౌన్ పరిధిలో నమోదైన కేసులో పరారీలో ఉన్న రిజ్వాన్ పోలీసులకు చిక్కినట్టు తెలిసింది.

Update: 2024-01-12 04:31 GMT

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగరంలో ఆరో టౌన్ పరిధిలో నమోదైన కేసులో పరారీలో ఉన్న రిజ్వాన్ పోలీసులకు చిక్కినట్టు తెలిసింది. గత ఏడాది నగరంలోని ఆరవటౌన్ పరిధిలో గల నిజాం కాలనీలో పోలీసులు దాడులు నిర్వహించారు. పీడీఎస్ గోదాంపై పోలీసులు దాడులు నిర్వహించగా అక్కడ కంట్రీమేడ్ పిట్టలతో పాటు తల్వార్, కత్తులు, గొడ్డలి దొరికాయి. ఈ కేసులో ఆనాడు పోలీసులు ఏ 1 గా ఉన్న మీర్జా హంజాల బెగ్ పట్టుబడ్డారు. ఆనాటి నుంచి ఏ 2 గా ఉన్న రిజ్వాన్ పరారీలో ఉన్నారు. రిజ్వాన్ గురువారం నిజామాబాద్ నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిజ్వాన్ బైక్ దొంగతనాలు చేసి తప్పించుకు తిరుగుతుండగా పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. రిజ్వాన్‌పై గతంలో కేసులు లేవని కానీ ఆరో టౌన్‌లో దొరికిన కంట్రీ మేడ్ పిస్టల్ కేసులో ఆమ్స్ యాక్ట్ నమోదు చేయబడి ఉందని తెలిసింది. పోలీసులు రిజ్వాన్ అదుపులోకి తీసుకొని ఆనాడు కంట్రీ మేడ్ పిస్టల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని బైకు దొంగతనాలు చేశారు, ఇతర కేసుల ఇన్‌వాల్వ్‌మెంట్ గురించి విచారిస్తున్నట్లు తెలిసింది.


Similar News