మురుగు కాలువలో పడి వ్యక్తి మృతి…

మురుగు కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మిర్యాలలో మంగళవారం చోటుచేసుకుంది.

Update: 2024-06-18 10:33 GMT

దిశ, నూతనకల్: మురుగు కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మిర్యాలలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నూతనకల్ మండల పరిధిలోని మిర్యాల గ్రామంలో ఇరుగు పెద్ద విజయ్ కొడుకు యేసు (23) రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుండగా మూర్ఛ వచ్చి సైడ్ ఉన్న మురుగు కాలువలో పడిపోవడంతో, బురదలో కూరుకుపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారని తెలిపారు. కొడుకు చనిపోవడంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు.


Similar News