విద్యార్థులకు గంజాయి విక్రయిస్తూ...

ఖమ్మం నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఖమ్మం ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్టు చేశారు.

Update: 2024-09-20 15:41 GMT

దిశ, ఖమ్మం : ఖమ్మం నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఖమ్మం ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 1.20 కేజీల గంజాయి, ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం టౌన్ 2 ఎక్సైజ్ సీఐ చంద్రమోహన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం నగరంలోని బొక్కల గడ్డ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు శుక్రవారం ఉదయం అక్కడ తనిఖీలు చేస్తుండగా తల్లాడ మండలానికి చెందిన తమ్మిశెట్టి ఆనంద్ విద్యార్థులకు గంజాయిని విక్రయిస్తున్నాడు. దాంతో అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా 1.20 కేజీల గంజాయి దొరికిందని సీఐ తెలిపారు. నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ నరేందర్, కానిస్టేబుళ్లు వీరభద్ర, నరసింహారావు పాల్గొన్నారు. 

Tags:    

Similar News