దారుణం.. ఎక్కువ డబ్బులు అడిగినందుకు వేశ్యను ముక్కలుగా నరికి హత్య చేసిన దుండగుడు

ముందుగా ఒప్పుకున్న డబ్బుల కంటే ఎక్కువ అడిగినందుకు ఓ వేశ్యను అత్యంత ఘోరంగా ఓ దుండగుడు హత్య చేశారు.

Update: 2024-09-20 16:04 GMT

దిశ, వెబ్ డెస్క్: ముందుగా ఒప్పుకున్న డబ్బుల కంటే ఎక్కువ అడిగినందుకు ఓ వేశ్యను అత్యంత ఘోరంగా ఓ దుండగుడు హత్య చేశారు. ఈ దారుణమైన సంఘటన తమిళనాడులోని చైన్నైలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలో లోని తొక్కేపాకం ప్రాంతంలో ఉంటున్న మణికందన్ అనే యువకుడు.. ఓ వేశ్యతో బేరం మాట్లాడుకొని తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం వేశ్య అతన్ని అదనంగా డబ్బులు ఇవ్వాలని అడిగింది. దీంతో వ్యభిచారం చేస్తున్న మహిళపై దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఓ సూట్ కేసులో పెట్టి పడేశాడు. అటుగా వెళ్తున్న స్థానికులు సూట్ కేసులో మహిళ మృతదేహం ఉన్నట్లు గమనించి పోలీసులకు ఫిర్యాదు. చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును చేదించి.. నిందితుడు మణికందన్‌ను అరెస్ట్ చేశారు.


Similar News