పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది.

Update: 2023-12-29 08:12 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది. వివరాల్లోకెళితే నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని సింగం పల్లికి చెందిన రాజు పోలీస్ స్టేషన్ వద్ద నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

తన భార్య కాపురానికి రావడం లేదని రాజు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. రాజుకు మూడు సంవత్సరాల క్రితం వివాహం జరగగా భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో వేరువేరుగా ఉంటున్నట్లు సమాచారం. ఈ విషయం పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో ఆత్మహత్నాయత్నానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Tags:    

Similar News