మాందోడి గ్రామంలో వ్యక్తి పై కొడవలితో దాడి..

రాజోలి మండల పరిధిలోని మాందోడి గ్రామంలో ఉప్పరి మోహన్ అనే వ్యక్తి పై హత్యాయత్నంలో భాగంగా కేసు నమోదైన ఘటన చోటుచేసుకుంది.

Update: 2024-07-03 16:58 GMT

దిశ, రాజోలి : రాజోలి మండల పరిధిలోని మాందోడి గ్రామంలో ఉప్పరి మోహన్ అనే వ్యక్తి పై హత్యాయత్నంలో భాగంగా కేసు నమోదైన ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం మందడి గ్రామానికి చెందిన ఉప్పరి తిమ్మప్ప అనే వ్యక్తి తన భార్యను అనుమానిస్తున్నాడని తన కూతురు వెంకటేశ్వరి, బాబాయి వరుస అయినా ఉప్పరి మోహన్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. ఆయన గ్రామ ప్రజల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా పంచాయతీలో ఉప్పరి తిమ్మప్ప తన పై పంచాయతి పెడతావా అంటూ ఉప్పరి మోహన్ పై చేయి చేసుకుంటూ కొడవలితో దాడి చేశాడు. ఉపరిమోహన్ తలకు తగలకుండా చెయ్యి అడ్డుపెట్టడంతో చేయికి బలమైన గాయాలు అయ్యాయి. ఈ విషయం పై పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న పోలీసులు మోహన్ ఫిర్యాదు మేరకు నూతన బీయన్ఎస్ చట్టాలైన 109, 118(1), 115(2) అటెంప్ట్ మర్డర్ కేస్ నమోదు చేసినట్లు ఎస్సై జగదీష్ పేర్కొన్నారు.


Similar News