వివాహితుడి ప్రేమ వేధింపులు.. యువతి బలవన్మరణం..

వివాహితుడి ప్రేమ వేధింపులు భరించలేక మనోవేదనతో ఓ యువతి

Update: 2024-07-04 08:41 GMT

దిశ,మరిపెడ: వివాహితుడి ప్రేమ వేధింపులు భరించలేక మనోవేదనతో ఓ యువతి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన మరిపెడ మండలం డీఎస్ఆర్ జెండాల తండా పరిధిలోని ఆముదాల గడ్డ తండా లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన బాదావత్ అనూష (20) చదువు మధ్యలోనే ఆపేసి కుటుంబసభ్యులతో వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అదే తండాకు చెందిన వివాహితుడైన భూక్యా సురేష్ పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. సురేష్ కి భార్య పిల్లలు ఉండటంతో అనూష కుటుంబ సభ్యులు, పెద్ద మనుషులు వీరి వివాహానికి అంగీకరించలేదు.

కొంతకాలంగా సురేష్ అనూషను తనతో కలిసి జీవించాలని వేధిస్తున్నాడు. మనోవేదనకు గురైన అనూష ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నా బిడ్డ కి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడని అనూష మృతదేహంతో కుటుంబ సభ్యులు సురేష్ ఇంటి ముందు ఆందోళన నిర్వహించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని శాంతింప చేశారు.తనను ప్రేమ పేరిట నమ్మించి భూక్యా సురేష్ మోసం చేశాడని, తన చావుకు సురేష్ కారణమని అనూష సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


Similar News