తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలు..

ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడిన సంఘటన గాంధారిలో చోటుచేసుకుంది.

Update: 2024-07-04 10:58 GMT

దిశ, గాంధారి : ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడిన సంఘటన గాంధారిలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో పాత పోలీస్ స్టేషన్ సమీపంలో గల వడ్ల కమ్మరి గల్లీలో కంకంటి కవిత బుధవారం ఉదయం ఇంటికి తాళం వేసి ముదలిలోని తన బంధువుల ఇంటి వద్ద ఫంక్షన్ కు వెళ్లి రాత్రి అక్కడే ఉన్నారు. గురువారం ఉదయం కవిత ఇంటింటి వారు కవితకు ఫోన్ చేసి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయని తెలపడంతో వెంటనే వారు ముదలి నుండి ఇంటికి చేరుకొని చూడగా ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

దీంతో ఎస్సై ఆంజనేయులు వచ్చి దొంగతనం జరిగిన తీరును కావలసిన ఆధారాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. దొంగలు 1.2 తులాల బంగారం, 5 తులాల వెండి, నగదు అపహరించినట్లు ఫిర్యాదు వచ్చిందని కేసునమోదు చేసి క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు తెలుసుకొని తప్పనిసరిగా త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఎస్సై ఆంజనేయులు తెలిపారు.


Similar News