మల్లారం అటవీ ప్రాంతంలో యువకుడు దారుణ హత్య

నిజామాబాద్ రూరల్ మండలం అటవి ప్రాంతంలో గుర్తు తెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

Update: 2024-01-05 08:11 GMT

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ రూరల్ మండలం అటవి ప్రాంతంలో గుర్తు తెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. సుమారు 35 సంవత్సరాల వయసు గల యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. యువకుడి చేతిపై గాయత్రి అన్న పచ్చబొట్టు మినహా ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదని పోలీసులు తెలిపారు. గురువారం మద్యంతో విందు చేసుకొని అక్కడ జరిగిన గొడవలో యువకుడిని గొంతు కోసి హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. యువకుడికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేకపోవడంతో అతని ఆచూకీ తెలిస్తే గాని హత్య గురించి విషయాలు బయటకి రావని నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ వెంకటనారాయణ తెలిపారు. సంఘటన స్థలాన్ని రూరల్ ఎస్సై మహేష్ క్లూస్ టీం సందర్శించి వివరాలు సేకరించారు.


Similar News