మాలిలో ఉగ్రదాడులు.. 64 మంది మృతి

మాలిలో ఉగ్రవాదులు శుక్రవారం ఘాతుకానికి తెగబడ్డారు.

Update: 2023-09-08 12:33 GMT

బమకో : మాలిలో ఉగ్రవాదులు శుక్రవారం ఘాతుకానికి తెగబడ్డారు. ఉత్తర మాలిలోని ఓ సైనిక స్థావరంతో పాటు ప్రయాణికులతో వెళ్తున్న పడవపై టెర్రరిస్టులు జరిపిన వేర్వేరు దాడుల్లో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. తొలుత టింబక్టు పట్టణం సమీపంలోని నైజర్‌ నదిలో పడవపై దాడి చేశారు. ఆ తర్వాత బాంబా పట్టణంలోని సైనిక స్థావరంపై ఎటాక్ జరిపారు.

ఈ రెండు దాడుల్లో 49 మంది పౌరులు, 15 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ ‘జమాత్ నస్రల్ ఇస్లామ్ వల్ ముస్లిమీన్’ ఈ దాడి చేసిందని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ దాడుల అనంతరం ఉగ్రవాదుల ఏరివేతకు ఆర్మీ చేపట్టిన ఆపరేషన్‌లో 50 మంది మిలిటెంట్లు హతమయ్యారు.


Similar News