Bigg Boss Telugu 8: సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయింది.. సేఫ్ జోన్ లోకి మణికంఠ.. ఆ కంటెస్టెంట్ ఇక బయటికే..

సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయింది.. సేఫ్ జోన్ లోకి మణికంఠ

Update: 2024-09-07 06:05 GMT

దిశ, వెబ్ డెస్క్ : బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమయ్యి హాట్ హాట్ గా సాగుతుంది.ఈ సారి అన్ని సీజన్ల కంటే కొత్తగా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించారు. సోలో ఎంట్రీ లేదంటూ జంటలుగా బిగ్ బాస్ పంపించాడు.. అయితే, సోమవారం నామినేషన్ ప్రక్రియ జరుగుతుందనే విషయం మనందరికీ తెలిసిందే.. ఆ రోజు నుంచి ఇక అసలైన ఆట మొదలవుతుంది.. ఈ సారి అందరూ ఒకరి మీద ఒకరు విరుచుకుపడ్డారు.

ఇక వీకెండ్ వచ్చేసరికి నాగ్ ఇంటి సభ్యులతో ముచ్చటించి వారి గొడవలకు పరిష్కారం చెబుతాడు. ఈ రోజు వినాయక చవితి పండగ కావడంతో స్పెషల్ ఎపిసోడ్ ను ప్లాన్ చేసినట్టు ఉన్నారు. ఇక ఆదివారం సంగతి తెలిసిందే కదా ఫుల్ ఎంటర్టైన్ తో పాటు ఎలిమినేషన్ కూడా ఉంటుంది. మొదటి వారం ఆడియెన్స్ బాగానే ఓట్లు వేసినట్లు తెలుస్తుంది. హౌస్ లో ఎప్పుడు ఫ్యామిలీ సెంటిమెంట్ ను వాడే నాగ మణికంఠ టాప్-2 లోకి రావడం అందరినీ షాక్ కు గురిచేస్తుంది. ఇతని దెబ్బకు సీరియల్ బ్యాచ్, యాంకర్లు కూడా కిందకి వెళ్లిపోయారు. షో మొదటి రోజు నుంచి నాగ మణికంఠ పేరు, అతని ఏడుపులు ఎక్కువగా కనిపించడంతో ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకోవడం మొదలు పెట్టేసారు.. నామినేట్ అయినా వాళ్లలో అందరూ సేఫ్ ప్లేస్ లో ఉండగా .. చివరి స్థానంలో బెజవాడ బేబక్క ఉన్నట్లు తెలుస్తోంది. అంటే, ఈ వారం ఈమెనే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని టాక్ బాగా వినిపిస్తుంది.

Tags:    

Similar News