ODI World Cup 2023: టీమ్ ఇండియా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ధోనికి మరోసారి కీలక బాధ్యతలు..!

భారత్‌ గడ్డపై జరగనున్న వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా మాజీ సారధి ఎంస్‌ ధోనికి మరోసారి కీలక బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Update: 2023-06-22 10:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌ గడ్డపై జరగనున్న వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా మాజీ సారధి ఎంస్‌ ధోనికి మరోసారి కీలక బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. వన్డే ప్రపంచకప్‌-2023లో భారత జట్టు మెంటార్‌గా ధోనిని నిమమించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో 2021 టీ20 ప్రపంచకప్‌లో కూడా ధోనీని భారత జట్టు మెంటార్‌గా బీసీసీఐ నియమించింది. కానీ ఆ టోర్నీలో భారత జట్టు తీవ్ర నిరాశపరిచింది.

లీగ్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయినప్పటికీ ధోని అనుభవాన్ని మరోసారి ఉపయోగించుకోవాలని బీసీసీఐ బావిస్తున్నట్లు భారత క్రికెట్‌ వర్గాలు వెల్లడించాయి. కాగా ఐపీఎల్‌-2023 టైటిల్‌ను ధోని సారధ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆక్టోబర్‌-నవంబర్‌లో ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను జూన్‌ 27న ఐసీసీ ప్రకటించే అవకాశం ఉంది.


Similar News