టీమ్​ ఇండియాకు గుడ్ న్యూస్.. వరల్డ్​కప్‌కు ​వారిద్దరు రెడీ!

Update: 2023-07-16 12:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: గాయాల కారణంగా జట్టుకు దూరమైన స్టార్ బౌలర్​ జస్​ప్రీత్ బుమ్రా అక్టోబర్‌లో ప్రారంభమయ్యే వరల్డ్​కప్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉందని సమాచారం. బుమ్రాతో పాటు శ్రేయస్ ​అయ్యర్, ప్రసిధ్​కృష్ణ కూడా పూర్తి ఫిట్​నెస్ సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది. జస్​ప్రీత్ బుమ్రా వచ్చే నెలలో ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని సమాచారం. ప్రస్తుతం బుమ్రా బెంగళూరులోని జాతీయ క్రికెట్ ​అకాడమీ ఎన్‌సీఏలో శిక్షణ తీసుకుంటున్నాడు. బుమ్రాతో పాటు శ్రేయస్​ అయ్యర్​ కూడా కోలుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. బుమ్రా మార్చిలో వెన్ను నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. గత నెల నుంచి బౌలింగ్​చేయడం సాధన చేస్తున్నాడు. దీనిపై జట్టు యాజమాన్యం త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

శ్రేయస్ అయ్యర్ ప్రాక్టీస్ ​స్టార్ట్..!

గత మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో గాయం కారణంగా టీమ్​ఇండియా మిడిలార్డర్​బ్యాటర్​ శ్రేయస్ ​అయ్యర్​ ఐపీఎల్‌కు దూరమైన విషయం తెలిసిందే. శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ స్టార్​ బ్యాటర్.. ఎన్‌సీఏలో కోలుకున్నట్లు తెలుస్తోంది. అతడు రోజు బ్యాటింగ్ ప్రాక్టీస్ ​చేస్తున్నట్లు సమాచారం. ఇలా గాయాలపాలైన ప్లేయర్లు కోలుకోవడం టీమ్​ఇండియాకు శుభపరిణామమే అయినా.. వీరిలో ఎంత మంది వరల్డ్​ కప్‌కు పూర్తిగా సిద్ధంగా ఉంటారో తెలియదు.


Similar News