దిశ, వెబ్డెస్క్: గాయాల కారణంగా జట్టుకు దూరమైన స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అక్టోబర్లో ప్రారంభమయ్యే వరల్డ్కప్కు అందుబాటులో ఉండే అవకాశం ఉందని సమాచారం. బుమ్రాతో పాటు శ్రేయస్ అయ్యర్, ప్రసిధ్కృష్ణ కూడా పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది. జస్ప్రీత్ బుమ్రా వచ్చే నెలలో ఐర్లాండ్తో జరిగే టీ20 సిరీస్కు అందుబాటులో ఉంటాడని సమాచారం. ప్రస్తుతం బుమ్రా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ ఎన్సీఏలో శిక్షణ తీసుకుంటున్నాడు. బుమ్రాతో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా కోలుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. బుమ్రా మార్చిలో వెన్ను నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. గత నెల నుంచి బౌలింగ్చేయడం సాధన చేస్తున్నాడు. దీనిపై జట్టు యాజమాన్యం త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
శ్రేయస్ అయ్యర్ ప్రాక్టీస్ స్టార్ట్..!
గత మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో గాయం కారణంగా టీమ్ఇండియా మిడిలార్డర్బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్కు దూరమైన విషయం తెలిసిందే. శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ స్టార్ బ్యాటర్.. ఎన్సీఏలో కోలుకున్నట్లు తెలుస్తోంది. అతడు రోజు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం. ఇలా గాయాలపాలైన ప్లేయర్లు కోలుకోవడం టీమ్ఇండియాకు శుభపరిణామమే అయినా.. వీరిలో ఎంత మంది వరల్డ్ కప్కు పూర్తిగా సిద్ధంగా ఉంటారో తెలియదు.