ICC World Cup 2023: టీమిండియాలో స్టార్లు ఉన్నా.. ఈసారి మాదే పైచేయి: పాకిస్తాన్ మాజీ క్రికెటర్
ఈసారి భారత గడ్డపై టీమిండియాను పాకిస్తాన్ ఓడించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అకీబ్ జావేద్ కామెంట్స్ చేశాడు.
దిశ, వెబ్డెస్క్: ఈసారి భారత గడ్డపై టీమిండియాను పాకిస్తాన్ ఓడించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అకీబ్ జావేద్ కామెంట్స్ చేశాడు. వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా.. పటిష్ట టీమిండియాను బాబర్ ఆజం జట్టు ఓడించగలదంటూ అభిప్రాయపడ్డాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో దాయాదులు భారత్-పాకిస్తాన్ మధ్య అహ్మదాబాద్ వేదికగా అక్టోబరు 14న మ్యాచ్ జరుగనుంది. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు సమతూకంగా ఉంది. యువ రక్తంతో నిండి ఉంది. టీమిండియాలో స్టార్లు ఉన్నారు.. కానీ వాళ్ల ఫిట్నెస్, ఫామ్ ఆశించిన తీరుగా లేదు. అందుకే భారత జట్టు తడబడుతోంది. అదే విధంగా అకీబ్ జావేద్ పాక్ పేస్ బౌలింగ్ విభాగం గురించి మాట్లాడుతూ.. నసీం షా కంటే జమాన్ ఖాన్ బెటర్ అని పేర్కొన్నాడు.