ICC Cricket World Cup Qualifier 2023: వెస్టిండీస్‌కు బిగ్‌ షాకిచ్చిన ఐసీసీ..

ICC Cricket World Cup Qualifier 2023లో భాగంగా నిన్న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఘోర పరాభవం చవిచూసింది.

Update: 2023-06-25 10:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: ICC Cricket World Cup Qualifier 2023లో భాగంగా నిన్న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఘోర పరాభవం చవిచూసింది. దీంతో విండీస్‌ వన్డే వరల్డ్‌కప్‌ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ భారీ పరాభవం నుంచి తేరుకోకముందే విండీస్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. జింబాబ్వేతో మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ మెయింటైన్‌ చేసినందుకు గాను ఆ జట్టు మ్యాచ్‌ ఫీజ్‌లో 60 శాతం కోత పడింది. నిర్ణీత సమయంలో విండీస్‌ బౌలర్లు 3 ఓవర్లు తక్కువ వేసినందున ఓవర్‌కు 20 శాతం చొప్పున ప్రతి ఆటగాడి మ్యాచ్‌ ఫీజ్‌లో 60 శాతం కోత విధించినట్లు ఐసీసీ వెల్లడించింది.

వెస్టిండీస్‌.. జింబాబ్వే చేతిలో ఓడినప్పటికీ సూపర్‌ సిక్స్‌ దశకు అర్హత సాధించింది. అయితే ఈ మ్యాచ్‌ కోల్పోవడంలో లాసైన 2 పాయింట్లు విండీస్‌కు తదుపరి దశలో అత్యంత కీలకంగా మారతాయి. అవి విండీస్‌ వరల్డ్‌కప్‌ అవకాశాలను ప్రభావితం చేస్తాయి. నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే.. 49.5 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌట్‌ కాగా, విండీస్‌ 44.4 ఓవర్లలో 233 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. వెస్టిండీస్‌ను 35 పరుగుల తేడాతో జింబాబ్వే ఓడించింది. గ్రూప్‌-ఏ నుంచి వెస్టిండీస్‌తో పాటు జింబాబ్వే, నెదర్లాండ్స్‌ సూపర్‌ సిక్స్‌ దశకు అర్హత సాధించాయి. గ్రూప్‌-బి నుంచి శ్రీలంక, స్కాట్లాండ్‌, ఒమన్‌ దేశాలు సూపర్‌ సిక్స్‌ దశకు చేరే అవకాశం ఉంది.


Similar News