ఫలితాల్లో ఖుష్బూకు ఎదురుదెబ్బ

by Shamantha N |
ఫలితాల్లో ఖుష్బూకు ఎదురుదెబ్బ
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ హీరోయిన్, బీజేపీ నేత ఖుష్బూ ఓడిపోయారు. థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేయగా.. అక్కడ డీఎంకే అభ్యర్థి ఎళిలన్ 17,522 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎళిలన్‌కు 32,445 ఓట్లు పోలవ్వగా.. ఖుష్బూకు 14,993 ఓట్లు పోలయ్యాయి. కాగా, తమిళనాడు ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి ఖుష్బూ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story