- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ వెబ్ డెస్క్: ఏపీలో నేడు ఏసీబీ మెరుపు దాడులు చేపట్టింది. రాష్ట్రంలోని పలు తహశీల్దార్ కార్యాలయాలే టార్గెట్ గా ఈ దాడులు కొనసాగాయి. ఈ దాడుల్లో అక్రమ నగదుతో పాటు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీం పట్నం ఎమ్మార్వో కార్యాలయంపై జరిపిన దాడుల్లో ఎమ్మార్వో చంద్రశేఖర్ కారులో రూ.రెండు లక్షలు, డిప్యూటీ ఎమ్మార్వో కారులో లక్ష రూపాయలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంత పురం జిల్లా కూడేరు ఎమ్మార్వో ఆఫీసులో నిర్వహించిన సోదాల్లో పలు దస్త్రాలను పరిశీలించారు. భూ రికార్డులపై కంప్యూటర్ ఆపరేటర్ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. వీటితో పాటు విశాఖ జిల్లాలోని కశీం కోట, విజయ నగరంతో పాటు శ్రాకాకుళం జిల్లా సంతకవిటి, కర్నూల్ జిల్లా ఎమ్మిగనూర్ ఎమ్మార్వో కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇది ఇలా ఉండగా గుంటూరు జిల్లాలో రాజు పాలెం ఎమ్మార్వో పై రైతులు ఫిర్యాదు చేయగా విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.