సోషల్ మీడియా ‘ప్రతిభ’కు కొలమానం కాదు: అభిషేక్

by  |
సోషల్ మీడియా ‘ప్రతిభ’కు కొలమానం కాదు: అభిషేక్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ లో భారీ వార్ జరుగుతుంది. నెపోటిజం వర్సెస్ ఔట్ సైడర్స్ అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో కంగనా రనౌత్ వీరాభిమాని అక్షిత్ సింఘాల్ అభిషేక్ బచ్చన్ ను టార్గెట్ చేస్తూ ఓ అనాలసిస్ చేసి మరి కామెంట్ చేశాడు. దీంతో స్మూత్ ఆన్సర్ ఇస్తూనే సూపర్ పంచ్ ఇచ్చాడు జూనియర్ బచ్చన్.

అసలు విషయం ఏంటంటే బాలీవుడ్ బ్యూటీ ప్రాచీ దేశాయ్ ఔట్ సైడర్. తనకు ట్విట్టర్‌లో ఫాలోవర్స్ సంఖ్య 1.3 మిలియన్. ఇక అభిషేక్ బచ్చన్ తండ్రి అమితాబ్ బచ్చన్ వారసత్వంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. తన ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 15.3 మిలియన్. ఇలా సెలెబ్రిటీ వారసులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఫాలో అవుతూ..కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన టాలెంటెడ్ యాక్టర్స్‌కు ప్రాధాన్యత ఇవ్వని జనాలు బాలీవుడ్ నుంచి ఇంకా మంచి ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారని ప్రశ్నించారు కంగనా అభిమాని. ఇప్పటి నుంచి మనం ఫేస్‌కు కాకుండా టాలెంట్‌ను సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని..కంగనా, ప్రధాని మోడీ, ఆర్ణబ్ గోస్వామిని కూడా టాగ్ చేశాడు.

దీనిపై స్పందించిన అభిషేక్ బచ్చన్ మిస్టర్ సింఘాల్ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య ప్రజాదరణ, ప్రతిభకు కొలమానం కాదని గుర్తుంచుకోవాలి అన్నారు. నా స్నేహితురాలు ప్రాచీ దేశాయ్ ప్రతిభావంతురాలైన నటి అని.. దానిని ఆమోదించేందుకు సోషల్ మీడియా అవసరం లేదని చెప్పారు. ఆమె పనే దీనికి సమాధానం చెప్తుందన్నారు అభిషేక్.


Next Story

Most Viewed