నలుగురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం

by  |
నలుగురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం జరట్ల రామాపురంలో విషాదం చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం నలుగురు పిల్లలకు పురుగుల మందు తాగించిన తల్లి… అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారకస్థితిలోకి వెళ్లిన ఐదుగురిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న 9ఏళ్ల సోనీ, నాలుగేళ్ల మానస, ఐదేళ్ల పల్లవి, 14నెలల బాలుడు రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతోనే మహిళ.. తన పిల్లలకు పురుగుల మందు తాగించిందని స్థానికులు చెబుతున్నారు.


Next Story