మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

by Shyam |
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, హుస్నాబాద్: మద్యానికి బానిసై ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం రెబర్తి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై సంపత్ వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన కలకోటి జగదీశ్వర్(38) గత కొంతకాలంగా మద్యానికి బానిసై, శనివారం క్రిమిసంహార మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుని భార్య తారవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed