IPL 2024: చెలరేగిన సూర్య కుమార్ యాదవ్.. ముంబై ఇండియన్స్ భారీ స్కోర్

by Disha Web Desk 19 |
IPL 2024: చెలరేగిన సూర్య కుమార్ యాదవ్.. ముంబై ఇండియన్స్ భారీ స్కోర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బ్యాటర్లు రాణించడంతో ముంబై 192 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 రన్స్ చేసింది. ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి ఆకట్టుకున్నాడు. 53 బంతుల్లో 78 పరుగుల చేసి ఎమ్ఐకు భారీ స్కోర్ అందించాడు. రోహిత్ శర్మ 36, తిలక్ వర్మ 34 పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, సామ్ కరాన్ 2, రబాడ ఒక వికెట్ తీశారు. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో పంజాబ్ ఛేదనకు దిగింది.

Next Story

Most Viewed