T20 ప్రపంచకప్: సెమీస్‌కు చేరే జట్లు ప్రకటించిన జైషా

by GSrikanth |
T20 ప్రపంచకప్: సెమీస్‌కు చేరే జట్లు ప్రకటించిన జైషా
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం టీ20 ప్రపంచకప్ పైనే ఉంది. ఐపీఎల్ ఎంత రసవత్తరంగా సాగుతున్నా.. పొట్టి కప్ కోసం వెయిట్ చేసేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జూన్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు అమెరికా, వెస్టిండీస్ దేశాల వేదికగా ఈ మెగా టోర్నమెంట్ జరుగనుంది. జూన్ 30వ తేదీన బార్బడోస్‌లో ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ ప్రపంచకప్‌లో గ్రూప్-ఏలో ఉన్న టీమిండియా తన తొలి మ్యాచ్‌ని జూన్ 5వ తేదీన ఐర్లాండ్‌తో ఆడనుంది. రెండో మ్యాచ్ జూన్ 9న పాకిస్థాన్‌తో జరగనుంది. రోహిత్ శర్మ సారథ్యంలో ప్రపంచకప్ ఆడుతున్న టీమిండియా, న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మొదటి, రెండో మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, ఈ టోర్నమెంట్‌లో సెమీస్‌కు వెళ్లే జట్లపై బీసీసీఐ సెక్రటరీ జైషా జోస్యం చెప్పారు. భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్లు బలంగా ఉన్నాయి. ఈ నాలుగు జట్లు సెమీస్‌కు వెళ్లే అవకాశం ఉందని ఆయన అన్నారు. అయితే, జైషా చెప్పిన లిస్ట్‌లో ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల పేర్లు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానిరి గురిచేస్తోంది.


టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా మహ్మద్ సిరాజ్.



Next Story