- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
టీమిండియా ఆటగాళ్లకు భారీ గుడ్ న్యూస్.. కళ్లు చెదిరే రీతిలో నజరానా ప్రకటించిన BCCI
![టీమిండియా ఆటగాళ్లకు భారీ గుడ్ న్యూస్.. కళ్లు చెదిరే రీతిలో నజరానా ప్రకటించిన BCCI టీమిండియా ఆటగాళ్లకు భారీ గుడ్ న్యూస్.. కళ్లు చెదిరే రీతిలో నజరానా ప్రకటించిన BCCI](https://www.dishadaily.com/h-upload/2024/06/29/347380-india-team.webp)
దిశ, వెబ్డెస్క్: టీ-20 వరల్డ్ కప్ గెలిచిన సంతోషంలో ఉన్న టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ మరో భారీ గుడ్ న్యూస్ చెప్పింది. వరల్డ్ కప్లో అద్భుత ప్రదర్శన చేసి విశ్వవిజేతగా నిలిచినందుకుగానూ టీమిండియాకు భారీ నజరానా ప్రకటించింది. టీ-20 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్కు ఏకంగా రూ.125 కోట్ల నజరానాను బీసీసీఐ అనౌన్స్ చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆదివారం వెల్లడించారు. వరల్డ్ కప్ ఆసాంతం అద్భుత ప్రదర్శన చేసి టైటిల్ గెలిచిన ప్లేయర్స్, కోచింగ్ సిబ్బంది, సపోర్టింగ్ స్టాఫ్కు ఈ సందర్భంగా జై షా అభినందలు తెలిపారు. కాగా, శనివారం వెస్టిండీస్లోని బ్రిడ్జిటౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ ఫైనల్ పోరులో భారత్ చిరస్మరణీయ విజయం అందుకుని విశ్వ విజేతగా అవతరించింది. ఈ క్రమంలోనే టీ-20 వరల్డ్ కప్ గెల్చిన భారత జట్టుకు భారీగా నజరానాను ప్రకటించింది.