పెళ్లి ఊరేగింపులో వరుడిపై యాసిడ్ దాడి.. చేసింది ఎవరో తెలిసి అంతా షాక్! (వీడియో)

by Disha Web Desk |
పెళ్లి ఊరేగింపులో వరుడిపై యాసిడ్ దాడి.. చేసింది ఎవరో తెలిసి అంతా షాక్! (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : టీనేజ్ వయసులో ప్రేమించుకోవడం కామన్ అయింది. నచ్చిన యువతీ, యువకులు ప్రేమించుకోవడం.. డేటింగ్ చేయడం పరిపాటిగా మారింది. అయితే వీళ్లలో అతి తక్కువ మందే పెళ్లి పీటలు ఎక్కుతారు. విడిపోయిన లవర్స్ కొంతమంది భగ్న ప్రేమికులుగా మారినా.. మరి కొంతమంది రివైంజ్ తీర్చుకుంటారు. తాజాగా ఓ యువతి ఇదే మాదిరిగా ప్రతీకారం తీర్చుకోబోయి అడ్డంగా బుక్కై చావు దెబ్బలు తిన్నది.

ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాకు చెందిన ఓ యువకుడు, యువతి ప్రేమించుకోని రెండేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆ యువతిని వదిలేసిన యువకుడు మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇవాళ పెళ్లి ఊరేగింపుకు జరుగుతుండగా బంధువులా తయారై వచ్చిన వరుడి ప్రియురాలు ఒక్కసారిగా అతనిపై యాసిడ్ పోసింది. దీంతో వరుడితోపాటు పెళ్లికి వచ్చిన బంధువులంతా షాక్ అయ్యారు. వెంటనే తేరుకుని యువతిని పట్టుకుని నిలదీశారు. అయితే వరుడు తనను మోసం చేశాడని, రెండేళ్లు రిలేషన్‌లో ఉండి, వాడుకుని వదిలేశాడని తెలిపింది. అతడిపై ప్రతీకారం తీర్చుకునేందేకు యాసిడ్ దాడి చేసినట్టు చెప్పింది. దీంతో కోపోద్రిక్తులు అయిన వరుడి తరుఫు బంధువులు యాసిడ్ దాడి చేసినందుకు యువతిపై తీవ్రంగా దాడి చేశారు. ఆమెను బంధించి మూకుమ్మడిగా దాడి చేసి గాయపర్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

CLICK HERE FOR TWITTER VIDEO



Next Story

Most Viewed