గణేశ్ మండపం వద్ద విషాదం.. శుభ్రం చేసేందుకు వచ్చి అనంత లోకాల్లో కలిసిన కార్మికుడు..

by Sumithra |
గణేశ్ మండపం వద్ద విషాదం.. శుభ్రం చేసేందుకు వచ్చి అనంత లోకాల్లో కలిసిన కార్మికుడు..
X

దిశ, మెదక్ ప్రతినిధి : గణేశ్ మండపం సమీపంలో అపశృతి నెలకొంది. మండపం వద్ద శుభ్రం చేసేందుకు వెళ్లిన గ్రామ పంచాయతీ కార్మికుడు విద్యుత్ షాక్ తో మృతి చెందిన ఘటన హవేలీ ఘనపూర్ మండలం రాజీపేటలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికుల కథనం మేరకు రాజ్ పేటకు చెందిన దాసరి పోచయ్య (60) గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే సోమవారం ఉదయం గ్రామంలో శుభ్రం చేస్తూ స్థానికంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్దకు వచ్చి శుభ్రం చేస్తున్నాడు.

అక్కడ ఏర్పాటు చేసిన జే వైర్ ను పక్కన పెట్టేందుకు పట్టుకోగా విద్యు త్ షాక్ తగిలి అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలియడంతో గణేష్ నిర్వాహకులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే పోచయ్య మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story