మంత్రాల నేపథ్యంలో మహిళ దారుణ హత్య?

by Rajesh |
మంత్రాల నేపథ్యంలో మహిళ దారుణ హత్య?
X

దిశ, నవీపేట్ : టెక్నాలజీ పరంగా అంతరిక్షంలో అడుగులు వేస్తున్న ఈ కాలంలో మూఢనమ్మకాలు, మంత్రాల నేపథ్యంలో రెంజల్ మండలం బోర్గం గ్రామంలో మంగళి చంద్రకళ అనే మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం నవీపేట్ మండలం కోస్లీ గ్రామ శివారులోని అలీసాగర్ లిఫ్ట్ కెనాల్‌లో గుర్తుతెలియని మహిళ మృతదేహం ఉందనే సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లారు. పంచనామ అనంతరం దర్యాప్తు చేయగా సదరు మహిళ రెంజల్ మండలం బోర్గం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. తలపై గాయం ఉండడంతో అనుమనదాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా రెంజల్ మండలం బోర్గం గ్రామానికి చెందిన మృతురాలు మంగళి చంద్రకళ మంత్రాలు చేస్తున్నదనే నేపథ్యంలో హత్య చేసి కోస్లీ కెనాల్‌లో పడేశారని ప్రాథమిక అంచనాకు వచ్చారు. నిందితులు మృతురాలికి రూ.50 వేల బాకీ ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. నిందితులు ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Advertisement

Next Story