Woman die : బస్సు ప్రమాదంలో మహిళ మృతి

by Sridhar Babu |
Woman die : బస్సు ప్రమాదంలో మహిళ మృతి
X

దిశ, కుబీర్ : కుబీర్ మండలంలోని డోడర్ణ తండా నంబర్ 5 వద్ద బస్సు ప్రమాదంలో జాదవ్ సుందరాబాయి అనే మహిళ తీవ్ర గాయాలై మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బైంసా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హిమాయత్ నగర్ నుండి బైంసాకు వస్తుంది. హిమాయత్ నగర్ నుండి డోడర్నా తండా నంబర్5లో దిగి బస్సు ఎడమ వైపు వెనక టైర్ల కింద పడింది. మృతురాలి ఎడమకాలు, ఎడమచేతికి తీవ్ర గాయాలయ్యాయి. 108 లో బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్య సేవల కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు.



Next Story