- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Delhi: వినియోగదారులకు అలర్ట్.. ATMలో కొత్త మోసం..
దిశ వెడ్ డెస్క్: మనలో చాలామంది ఏటీఎంలను ఉపయోగిస్తుంటారు. అయితే ఆ ఏటీఎంకి డబ్బులు డ్రా చేయడానికి వెళ్ళినప్పుడు వినియోగదారులను కొంతమంది కేటుగాళ్లు మోసం చేస్తున్నారు. ఇలా వినియోగదారులను బోల్తా కొట్టించి డబ్బులు దోచుకుంటున్న ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కొంతమంది కేటుగాళ్ళు సెక్యూరిటీ లేని ATMలలో సీసీ కెమెరాలకు స్ప్రే చల్లి, ATM మిషన్ లోని కార్డు రీడర్ని తొలగిస్తున్నారు.
దీంతో మనీ డ్రా చేయడానికి వచ్చిన కస్టమర్ ఏటీఎం మిషన్లో కార్డు పెట్టగానే ఆ కార్డు మిషన్లో ఇరుక్కుపోతుంది. ఈ క్రమంలో ఆ కేటుగాళ్లు పిన్ ఎంటర్ చేస్తే కార్డు బయటకు వస్తుంది అని కస్టమర్లు నమ్మిస్తున్నారు. వాళ్ళ మాటలు నమ్మి కస్టమర్లు పిన్ ఎంటర్ చేస్తారు. అయినా ఆ కార్డు బయటకు రాదు. ఇక చేసేది ఏమీ లేదు డైరెక్ట్గా బ్యాంకుకు వెళ్లాలి అని చెప్తారు.
ఇక వాళ్ళ మాటలు నమ్మి కస్టమర్స్ వెళ్లిపోయిన వెంటనే, ఆ ముఠా వాళ్ల చేతివాటం చూపిస్తారు. కస్టమర్ ఎంటర్ చేసిన పిన్నులను వాళ్ళు ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేసేస్తారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న వాళ్ళను తాజాగా ఢిల్లీ పోలీస్ అరెస్ట్ చేశారు