అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య

by Sridhar Babu |
అత్తింటి  వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య
X

దిశ, ఖమ్మం రూరల్ : అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రూరల్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రూరల్ మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన షేక్ జూనేరియా 22) అదే గ్రామానికి చెందిన షేక్ నజీర్ తో 3 ఏళ్ల క్రితం వివాహమైంది. తురుచుగా భర్త నజీర్ భార్య ను వేధించడం మొదలు పెట్టాడు. అత్త షేక్ బేగంకు

అదే విధంగా ఆడబిడ్డలు ఫర్వీను హసీనాలకి చెప్పినప్పటికీ వారు కూడా పట్టించుకోలేదు. పైగా ఆమె భర్తకి సపోర్ట్ చేశారు. దాంతో ఆమె తల్లిగారింటికీ వెళ్లి నెల రోజుల తర్వాత ఈ నెల నాలుగో తేదీన తిరిగి భర్త దగ్గరికి వచ్చింది. అయినా తన భర్తతో మార్పు రాకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని మృతి చెందింది. మృతురాలి తండ్రి ముస్తఫా ఫిర్యాదు మేరకు భర్త, అత్త, ఇద్దరు ఆడబిడ్డల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామారావు తెలిపారు.

Advertisement

Next Story