భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య

by Sridhar Babu |
భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య
X

దిశ, జమ్మికుంట : వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్నావ్ అంటూ నిత్యం వేధింపులకు గురి చేయగా మానసికంగా కుంగిపోయిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన జమ్మికుంట పట్టణ పరిధిలోని మారుతి నగర్ లో చోటుచేసుకుంది. జమ్మికుంట టౌన్ సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. వీణవంక మండలం వల్భాపూర్ గ్రామానికి చెందిన మారుమూళ్ల పద్మ, లక్ష్మయ్య దంపతుల కూతురు కావ్య(28) ను అదే మండలం ఎలబాక గ్రామానికి చెందిన జీడి రాజు అనే వ్యక్తికి ఇచ్చి 12 సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు. కాగా గత మూడు

సంవత్సరాలుగా రాజు, కావ్య దంపతులు పట్టణంలోని మారుతి నగర్ లో ఉంటున్నారు. గత కొద్ది రోజుల క్రితం కావ్య ను భర్త రాజు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావ్ అంటూ అనుమానం పెంచుకొని కొట్టాడు. ఈ విషయంపై పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ కూడా నిర్వహించారు. తన బిడ్డను రాజు ప్రతిరోజూ ఏదో ఒక విషయంలో అనుమానిస్తూ చనిపోమంటూ వేధించటంతోనే జీవితంపై విరక్తి చెంది ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Next Story

Most Viewed