చేపల వేటకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

by Sridhar Babu |
చేపల వేటకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
X

దిశ, దౌల్తాబాద్ : చేపట వేటకు వెళ్లి కాలువలో పడి ఇద్దరు కార్మికులు మృతి చెందిన సంఘటన దౌల్తాబాద్ మండల పరిధిలోని సూరంపల్లి - ముత్యంపేట గ్రామాల మధ్య చోటు చేసుకుంది. దౌల్తాబాద్ ఎస్ఐ శ్రీరామ్ ప్రేమ్ దీప్ తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు మాధవరం గ్రామానికి చెందిన తిరుపతి రావు(30), సోమయ్య(35) అనే ఇద్దరు కార్మికులు దౌల్తాబాద్ మండల పరిధిలో కొనసాగుతున్న NPS కెనాల్ లో కూలీలు గా పనిచేస్తున్నారు. అయితే మంగళవారం

ఇద్దరు కలిసి సూరంపల్లి, ముత్యంపేట గ్రామాల మధ్య కెనాల్ లో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాధావశాత్తు గల్లంతు అయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టినా రాత్రి వరకు ఆచూకీ లభించలేదు. బుధవారం ఇద్దరి మృతదేహాలను గుర్తించి యంత్రాల ద్వారా వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీరామ్ ప్రేమ్ దీప్ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed