కామారెడ్డిలో ఇద్దరు బాలికలు అదృశ్యం

by Disha Web Desk 15 |
కామారెడ్డిలో ఇద్దరు బాలికలు అదృశ్యం
X

దిశ, కామారెడ్డి క్రైమ్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యమైనట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి బుధవారం పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గంగోత్రి (11), నజియ (7) వీరిద్దరూ జిల్లా కేంద్రంలోని బాలసదనంలో ఉంటున్నారు. వీరికి తల్లిదండ్రులు లేకపోవడంతో బాలసదనంలో ఉంటూ హరిజనవాడలోని జెడ్పీహెచ్ఎస్ లో చదువుతున్నారు.

ఈ నెల 13న ఉదయం యధావిధిగా స్కూలుకు వెళ్లిన గంగోత్రి, నజియా స్కూల్లో నుండి ఉపాధ్యాయులకు చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. దాంతో వారి గురించి ఎంత వెతికినా జాడ దొరకలేదని తెలిపారు. బుధవారం బాలసదనం ఇన్​చార్జి గంగుబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇంతకు ముందు కూడా గంగోత్రి రెండుసార్లు వెళ్లిపోగా వెతికి తీసుకొచ్చినట్టు తెలిపారు. వీరి ఆచూకీ తెలిసిన వారు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో సమాచారం తెలపాలని పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story

Most Viewed